అయ్య బాబోయ్‌.. ర‌వితేజ `టైగ‌ర్‌` కోసం అన్ని కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం `టైగర్ నాగేశ్వరరావు` మూవీతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. వంశీకృష్ణ నాయుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్ నిర్మిస్తున్నారు. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇందులో ఓ కీల‌క పాత్ర‌ను పోషించింది. 1970ల కాలం నాటి టైగర్ జోన్ గా పేరుగాంచిన స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బ‌యోపిక్ ఇది. […]