టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల స్క్రిప్ట్..అప్పుడే తేలిపోయిందా!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన రచ్చ ఇంకా ఆగలేదు. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టి‌డి‌పికి క్రాస్ ఓటు చేయడంపై వైసీపీ నేతలు ఫైర్ అవుతూనే ఉన్నారు. వారంతా డబ్బులకు అమ్ముడుపోయారని విమర్శిస్తున్నారు. అలాగే ఆ నలుగురు ఎమ్మెల్యేలని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే సస్పెండ్ అయిన నలుగురు..వైసీపీపై విరుచుకుపడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్ గా ఫైర్ అవుతున్నారు. అసలు తమని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి సజ్జల ఎవరు అని […]

గిద్దలూరుపై టీడీపీ పట్టు..ఆ మెజారిటీ కరుగుతుందా?

తెలుగుదేశం పార్టీ 1999 ఎన్నికల్లో సత్తా చాటి..ఆ తర్వాత నుంచి సత్తా చాటని నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అప్పటినుంచి గెలుపుకు దూరమైంది. అలా గెలుపుకు దూరమైన స్థానాల్లో గిద్దలూరు కూడా ఒకటి. ఇక్కడ చివరిగా టి‌డి‌పి గెలిచింది 1999 ఎన్నికల్లోనే..2004 నుంచి వరుసగా ఓడిపోతూ వస్తుంది. 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ వరుసగా గెలుస్తూ వస్తుంది. అయితే 2014లో వైసీపీ నుంచి గెలిచిన అశోక్ రెడ్డిని టి‌డి‌పిలోకి తీసుకున్నారు. అయినా సరే […]

 వైసీపీలోకి జేడీ..విశాఖలోనే పోటీ.?

సి‌బి‌ఐ మాజీ జే‌డి లక్ష్మీనారాయణ వైసీపీలోకి వెళుతున్నారా? అంటే తాను చెప్పిన పని చేస్తే వైసీపీలోకి వెళ్లడానికైనా రెడీ అని ఆయన అంటున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే అంశంపై క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఖచ్చితంగా విశాఖ ఎంపీగానే పోటీ చేస్తానని, కానీ ఏ పార్టీలో నుంచి పోటీ చేస్తానో చెప్పలేను అని అంటున్నారు. కాకపోతే గ్రామీణాభివృద్ధి, ఉద్యోగాలు, వ్యవసాయం..ఈ మూడు రంగాలకు సంబంధించి తన వద్ద […]

రాపాకకు టీడీపీ ఆఫర్..పక్కా స్క్రిప్ట్ అంటా!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పికి క్రాస్ ఓటింగ్ విషయంలో పెద్ద రచ్చ నడుస్తోంది. ఇప్పటికే టి‌డి‌పికి క్రాస్ ఓటు చేశారని వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలని తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి..ఈ నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నలుగురుని చంద్రబాబు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేశారు గాని అందులో నిజాలు […]

నెల్లూరులో టీడీపీకి ఊపు..ఆధిక్యం వస్తుందా?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలపడుతుంది. చాలా ఏళ్ల నుంచి ఇక్కడ పార్టీకి పెద్ద బలం లేదు..గత నాలుగు ఎన్నికల నుంచి మంచి ఫలితాలు సాధించలేదు. 2014 ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లు ఉంటే టి‌డి‌పి 3 సీట్లు గెలుచుకోగా, వైసీపీ 7 సీట్లు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అంటే టి‌డి‌పికి ఒక్క సీటు కూడా దక్కలేదు. అలాంటి పరిస్తితులని నుంచి టి‌డి‌పి ఇప్పుడు పుంజుకుంటుంది. నెల్లూరులో పలు […]

ఎమ్మెల్యేల కొనుగోలు..నీతులు ఎవరికి?

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్ధి అనూహ్యంగా 23 ఓట్లు తెచ్చుకుని ఎమ్మెల్సీగా గెలిచారు. మొత్తం 7 స్థానాలకు ఎన్నికలు జరగగా..వైసీపీ 7 గురు అభ్యర్ధులని బరిలో దింపింది..టీడీపీ ఒక అభ్యర్ధిని రంగంలోకి దింపింది..అయితే ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఇక వైసీపీకి 151 ఎమ్మెల్యేల బలం ఉంది..ఇక టి‌డి‌పి నుంచి నలుగురు, జనసేన నుంచి ఒకరు వైసీపీలోకి వచ్చారు. దీంతో వైసీపీ బలం […]

జగ్గంపేటలో జ్యోతుల జోష్..ఈ సారి వైసీపీకి చెక్!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో జోష్ పెరుగుతుంది. వరుస ఓటములతో కుదలైన పార్టీకి సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ కొత్త ఊపుని తీసుకొస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో పార్టీని గెలిపించే దిశగానే జ్యోతుల ముందుకెళుతున్నారు. అసలు జగ్గంపేటలో టి‌డి‌పి చివరిగా గెలిచింది 1999 ఎన్నికల్లోనే జ్యోతుల నెహ్రూ అప్పటిలో టి‌డి‌పి నుంచి వరుసగా గెలిచారు. 2004లో అక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2009లో కూడా కాంగ్రెస్ గెలిచింది. ఇటు జ్యోతుల మాత్రం ప్రజారాజ్యంలోకి […]

టీడీపీలోకి కోటంరెడ్డి తమ్ముడు..రూరల్‌లో ఫస్ట్ ఛాన్స్!

వరుసగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన జోష్ లో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి ఇంకా వలసలు జోరు అందుకునేలా ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీని కాదని కొందరు నేతలు టి‌డి‌పి వైపుకు వస్తున్నారు. అంటే మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీ వైపుకు వస్తున్నారని తెలుస్తోంది. ఇదే క్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టి‌డి‌పికి దగ్గరైన విషయం తెలిసిందే. వైసీపీలో తనపై నిఘా పెట్టడం, ఫోన్లు ట్యాప్ చేయడం, […]

 అటు నలుగురు..ఇటు నలుగురు..టీడీపీ లెవెల్ చేసిందా!

మొత్తానికి తమ పార్టీ నుంచి జంప్ అయిపోయిన నలుగురు ఎమ్మెల్యేలకు కౌంటరుగా వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలని టి‌డి‌పి లాగిందనే చెప్పాలి. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చాక టి‌డి‌పి నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో కొందరు..వైసీపీ అధికార బలానికి తల వంచక తప్పలేదు. ఈ క్రమంలో వరుసపెట్టి నలుగురు టి‌డి‌పి ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో టి‌డి‌పి బలం 19కు చేరుకుంది. అయితే 19 లో కూడా ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు […]