ప్రకాశంలో వైసీపీ లీడ్ తగ్గేదెలే.!

ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీకి పట్టున్న జిల్లాల్లో ఇదొకటి. ఇక్కడ వైసీపీకి క్షేత్ర స్థాయిలో బలం ఉంది. రెడ్డి, ఎస్సీ సామాజికవర్గాల హవా ఎక్కువ ఉండటం వల్ల..గత రెండు ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ లీడ్ సాధిస్తుంది. 12 సీట్లు ఉన్న ఈ జిల్లాలో 2014లో వైసీపీ 6, టి‌డి‌పి5, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ 8, టి‌డి‌పి 4 సీట్లు గెలుచుకున్నాయి. అయితే ఇప్పటికీ అక్కడ వైసీపీ హవా ఉంది. కానీ ఇటీవల లోకేష్ […]

ఆ ఏడు వైసీపీ కంచుకోటలే..టీడీపీకి నో ఛాన్స్.!

ఏపీలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు మెజారిటీ సంఖ్యలో వైసీపీకే మద్ధతు ఇస్తున్న విషయం తెలిసిందే. మొదట నుంచి ఈ వగ్రలు కాంగ్రెస్‌కు తర్వాత వైసీపీకి మద్ధతు ఇస్తున్నారు. ఏదో కొంతమేర టి‌డి‌పికి సపోర్ట్ ఉంది. ఇక ఎస్టీలు పూర్తిగా వైసీపీ వైపే ఉన్నారు. రాష్ట్రంలో ఎస్టీ రిజర్వ్ స్థానాలు 7 ఉన్నాయి. ఆ ఏడు స్థానాల్లో వైసీపీ హవానే ఉంది. పాలకొండ, సాలూరు, కురుపాం, పాడేరు, అరకు, రంపచోడవరం, పోలవరం.. స్థానాలు ఎస్టీ స్థానాలు. 2014లో ఒక్క […]

ఆ రెండు పార్టీలకు ఫుల్ పబ్లిసిటీ… మరి తమ్ముళ్ల పరిస్థితి….!

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ మీద మాట్లాడుకుంటున్నారు. అదే బ్రో సినిమా. వాస్తవానికి ఆ సినిమాలో కేవలం ఓ రెండు నిమిషాల సేపు మాత్రమే పృద్వీరాజ్ క్యారెక్టర్. అది కూడా ఓ పాటలో భాగం. అక్కడ పృద్వీ వేసే డ్యాన్స్…. ఆ సీన్‌లో పవన్ చెప్పే డైలాగ్‌ ఇప్పుడు ఏపీలో ట్రెండింగ్ టాపిక్. పృద్వీ వేసిన స్టెప్పులు సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటల చుట్టూ అంబటి రాంబాబు వేసినట్లుగా ఉందని అంతా పోల్చారు. […]

పరిటాల ఫ్యామిలీకి మళ్ళీ లక్ లేదా? రెండు పోతాయా?

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దివంగత పరిటాల రవీంద్ర అనంతలో తిరుగులేని నేతగా ఎదిగారు. ఆయన మరణం తర్వాత సునీతమ్మ సత్తా చాటారు. కానీ పరిటాల వారసుడు శ్రీరామ్ విజయాలని కొనసాగించలేకపోయారు. తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో రాప్తాడు బరిలో దిగి ఓడిపోయారు. తర్వాత పరిటాల ఫ్యామిలీకి చంద్రబాబు రెండు సీట్ల బాధ్యతలు ఇచ్చారు. సునీతమ్మకు రాప్తాడు, శ్రీరామ్‌కు ధర్మవరం బాధ్యతలు ఇచ్చారు. దాదాపు వీరి […]

వెస్ట్‌లో తమ్ముళ్ళ కుమ్ములాట..మళ్ళీ వైసీపీ వశమే.!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఒకప్పుడు టి‌డి‌పి కంచుకోట..కానీ వైసీపీ కంచుకోటగా మారిపోయింది. గత ఎన్నికల్లో జిల్లాలో 15 సీట్లు ఉంటే వైసీపీ 13, టి‌డి‌పి 2 సీట్లు గెలుచుకుంది. అయితే ఈ సారి కూడా వైసీపీ హవా నడిచేలా ఉంది. టి‌డి‌పి-జనసేన విడివిడిగా పోటీ చేస్తే వైసీపీ ఆధిక్యం ఖాయం. ఒకవేళ పొత్తు ఉంటే వైసీపీ గట్టి పోటీ ఎదురుకునే ఛాన్స్ ఉంది. అయితే టి‌డి‌పి కొన్ని సీట్లలో, జనసేన కొన్ని సీట్లలో బలపడింది. […]

అటు బాబు-ఇటు పవన్..మధ్యలో లోకేష్..జగన్‌కే మేలు.!

ప్రతిపక్షాలు పూర్తిగా జగన్‌ని రౌండప్ చేశాయి. అన్నీ వైపులా నుంచి జగన్‌ని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇటు వైపు జగన్ మాత్రం ఒంటరిగా పోరాడుతున్నారు. తాను కేవలం ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం..జగన్ వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుందని, బీహార్ కంటే దారుణంగా ఏపీ పరిస్తితి తయారైందని విమర్శలు చేస్తున్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గరపడటంతో విపక్షాలు జగన్ ప్రభుత్వం టార్గెట్ గా దూకుడు పెంచాయి. ఇప్పటికే టి‌డి‌పి నుంచి నారా […]

కడప-కర్నూలు మళ్ళీ వన్‌సైడ్..కానీ స్వీప్ డౌట్.!

ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాలు..వైసీపీ కంచుకోటలు. గత రెండు ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో వైసీపీ హవా స్పష్టంగా నడుస్తుంది. 2014లో రాష్ట్రంలో టి‌డి‌పి హవా ఉన్నా..ఈ రెండు జిల్లాల్లో వైసీపీ సత్తా చాటింది. కడపలో 10 సీట్లు ఉంటే వైసీపీ 9 సీట్లు, టి‌డి‌పి 1 సీటు మాత్రమే గెలుచుకుంది. ఇక కర్నూలులో 14 సీట్లు ఉంటే వైసీపీ 11, టి‌డి‌పి 3 సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికల్లో మాత్రం రెండు జిల్లాల్లో వైసీపీ స్వీప్ […]

బాబు ప్రాజెక్టు పాలిటిక్స్..జనం నమ్ముతారా?

జగన్ ప్రభుత్వం టార్గెట్ గా గత నాలుగేళ్లుగా చంద్రబాబు విమర్శనస్త్రాలు సంధిస్తూనే వస్తున్నారు. సందు దొరికితే చాలు. ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకుంటూ విరుచుకుపడుతున్నారు. జగన్ మంచి చేసిన వాటిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బాబు కొత్త రూట్ వెతుక్కున్నారు. జగన్ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులు పడకేశాయని, అసలు ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు పెట్టలేదని, తమ హయాంలోనే భారీగా ఖర్చు పెట్టమని ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి […]

ఎన్టీఆర్ సొంత గడ్డ..వైసీపీ అడ్డా..మళ్ళీ టీడీపీ అస్సామే.!

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు..దివంగత ఎన్టీఆర్ పుట్టిన వూరు నిమ్మకూరు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక నిమ్మకూరు ప్రస్తుతం పామర్రు నియోజకవర్గంలో ఉంది. అంతకముందు పామర్రు మండలం గుడివాడ నియోజకవర్గంలో ఉండేది. దీంతో అక్కడ ఎన్టీఆర్ పోటీ చేసి సత్తా చాటారు. తర్వాత టి‌డి‌పి హవా కొనసాగుతూ వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గుడివాడ అలాగే ఉంది..పామర్రు సెపరేట్ నియోజకవర్గంగా ఏర్పడింది. అయితే ఇలా ఎన్టీఆర్ సొంత గడ్డగా ఉన్న పామర్రులో టి‌డి‌పి ఇంతవరకు గెలవలేదు. 2009లో […]