మంత్రుల‌తో లోకేశ్ ఆట‌లు చూస్తే అవాక్క‌వ్వాల్సిందే…

ఏపీ కేబినెట్‌లో సీఎం చంద్ర‌బాబు త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు మంత్రి లోకేశ్ నెంబ‌ర్ 2 పొజిష‌న్‌లోకి ఎంట‌ర్ అయిపోయాడు. లోకేశ్ టీడీపీకి భ‌విష్య‌త్ సార‌థిగా ఇప్ప‌టికే అంద‌రూ అంగీక‌రిస్తుండ‌డంతో లోకేశ్ అటు పార్టీలోను, ఇటు ప్ర‌భుత్వంలోను క్ర‌మ‌క్ర‌మంగా ప‌ట్టు సంపాదిస్తున్నాడు. ఇప్ప‌టికే లోకేశ్ త‌న శాఖ‌ల్లోనే కాకుండా కొన్ని కీల‌క శాఖ‌ల‌కు సైతం అన‌ధికారిక మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న గుస‌గుస‌లు టీడీపీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి. హోం, రెవెన్యూ లాంటి కీల‌క శాఖ‌ల్లో లోకేశ్ పెత్త‌నం కాస్త ఎక్కువ‌గానే ఉంటోంద‌న్న […]

ఎన్నో ఆశ‌లతో సైకిల్ ఎక్కితే ఇప్పుడు ఈ పరిస్థితి

2019.. అధికార టీడీపీకి ఇది ఎంతో కీల‌కం కాబోతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని ఒక‌వైపు వైసీపీ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రోపక్క చుట్టూ స‌మ‌స్య‌లు, వివాదాలు, విమ‌ర్శలు! ఇవ‌న్నీ టీడీపీ అధినేత‌కు స‌వాళ్లు విసురు తున్నాయి. ఇంకా రెండేళ్ల కంటే త‌క్కువ స‌మ‌యం ఉన్నా.. ఇదంతా టీడీపీకి ముళ్ల బాటే కానుంది. నియోజ‌క‌వ‌ర్గాల పెంపు లేన‌ట్టేన‌ని కేంద్రం స్పష్టంచేయ‌డంతో పాటు ఎన్నో ఆశ‌లు పెట్టుకుని టీడీపీలోకి వ‌చ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి చెల‌రేగుతోంది. ఈనేప‌థ్యంలో 2019 ఎన్నిక‌ల్లో […]

త‌మ్ముడి బాట‌లోనే అన్న.. కార‌ణాలివే

ర‌క్త‌సంబంధం వేరు.. రాజ‌కీయాలు వేరు! కానీ నంద్యాల‌లో ఇప్పుడు ర‌క్త‌సంబంధం వైపు రాజకీయాలు న‌డుస్తున్నాయి. త‌మ్ముడి న‌డిచిన బాట‌లోనే అన్న కూడా ప‌య‌నించేందుకు సిద్ధమైపోయారు. త‌మ్ముడు శిల్పా మోహ‌న‌రెడ్డి పార్టీ వీడుతున్నా.. వేరే పార్టీ నుంచి బ‌రిలోకి దిగినా.. తాను మాత్రం టీడీపీలోనే ఉంటాన‌ని, పార్టీ విజ‌యానికే ప‌నిచేస్తాన‌ని చెప్పిన ఎమ్మెల్సీ శిల్పాచ‌క్ర‌పాణి.. ఇప్పుడు వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు రెడీ అయ్యారు. మ‌రి టీడీపీలో ఉంటాన‌ని చెప్పిన ఆయ‌న‌.. ఇంత స‌డ‌న్‌గా పార్టీ మారాల‌నే నిర్ణ‌యం తీసుకోవ‌డానికి […]

ఏపీలో క‌మ్మ‌+కాపు క‌లిసే ప్లాన్‌

తెలుగు రాజ‌కీయాల‌కు కులాల‌కు అవినాభావ సంబంధం ఉంది. ఇది ఎవ‌రు కాద‌న్నా ? ఎవ‌రు ఔన‌న్నా నిజం. ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కుల రాజ‌కీయాల ప్రాబ‌ల్యం బాగా పెరిగిపోయింది. ఏపీలో నిన్న‌టి వ‌ర‌కు క‌మ్మ వ‌ర్సెస్ రెడ్ల మ‌ధ్య అధికారం కోసం వార్ జ‌రుగుతుంటే ఇప్పుడు ఈ పోరులో కాపులు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక తెలంగాణ‌లో అధికారం కోసం ఇప్పుడు వెల‌మ వ‌ర్సెస్ రెడ్ల మ‌ధ్య పోరు జ‌రుగుతోంది. ఇక తెలంగాణ‌లో కంటే ఏపీలోనే […]

టీడీపీలో కేశినేని నిర్వేదం…ఆ పార్టీ వైపు చూపు..?

కేశినేని నాని విజ‌య‌వాడ ఎంపీ… ముక్కుసూటి త‌నానికి మారుపేరు. కేశినేని ట్రావెల్స్ అధినేత‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న నాని 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ ద్వారా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ పార్టీలో చేరిన కొద్ది రోజుల‌కే బ‌య‌ట‌కు వ‌చ్చిన నాని చంద్ర‌బాబు హామీతో గ‌త ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందే ఎంపీ సీటుపై హామీ పొందారు. చంద్ర‌బాబు పాద‌యాత్ర‌లో ఖ‌ర్చంతా భ‌రించ‌డంతో పాటు పార్టీకి ఆర్థికంగా మేళ్లు చేసిన ఆయ‌న‌కు చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో హామీ […]

బాబుపై జ‌య‌దేవ్ తీవ్ర అసంతృప్తి… కారణం ఏంటి!

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు చిత్తూరు జిల్లాలో బ‌లంగా ఉన్న గ‌ల్లా ఫ్యామిలీ ఎన్నో ఆశ‌ల‌తో కాంగ్రెస్‌తో సుదీర్ఘ అనుబంధం తెంచుకుని సైకిలెక్కేసింది. నాడు టీడీపీకి బ‌ల‌మైన అభ్య‌ర్థులు ఎవ్వ‌రూ లేక‌పోవ‌డంతో చంద్ర‌బాబు కూడా గ‌ల్లా ఫ్యామిలీకి రెడ్ కార్పెట్ వేసి మ‌రీ పార్టీలో చేర్చుకున్నారు. అప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న గ‌ల్లా అరుణ‌కుమారికి చంద్ర‌గిరి అసెంబ్లీ సీటుతో పాటు గ‌ల్లా జ‌య‌దేవ్‌కు గుంటూరు లోక్‌స‌భ సీటు ఇచ్చారు. గుంటూరు నుంచి జ‌య‌దేవ్ 90 వేల […]

2019రాజ‌మండ్రి ఎంపీ సీటుపై టీడీపీ, వైసీపీ కొత్త ప్రయోగం!

ఏపీలో ఎవ‌రైనా అధికారం ద‌క్కించుకునేందుకు తూర్పు గోదావ‌రి జిల్లా కీల‌క‌మైంది. ఈ జిల్లాలో మెజార్టీ సీట్లు గెలుచుకున్న పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంటుంద‌న్న నానుడి ఉంది. గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాలుగాను ఈ సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ జిల్లాలో రాజ‌మండ్రి ఎంపీ సీటుకు రాజ‌కీయంగా చాలా ప్రాధాన్య‌త ఉంది. రాజ‌మండ్రి ఎంపీగా పోటీ చేసేందుకు ప్ర‌ధాన పార్టీల నుంచి ప్ర‌ముఖులే పోటీప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ, వైసీపీ అభ్య‌ర్థులుగా పోటీ […]

నంద్యాల‌లో ప్ర‌జెంట్ ట్రెండ్ ఏంటి?

క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో ఉప ఎన్నిక రోజు రోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ఇక్క‌డ రోజు రోజుకు వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. ఆ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుంటే టీడీపీ గ్రాఫ్ త‌గ్గుతోంది. ఇక్కడ అన్ని వ‌ర్గాల ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు చంద్ర‌బాబు చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో 56 వేల ఓట‌ర్లు ఉన్న ముస్లింల‌ను ఆక‌ట్టుకునేందుకు చంద్ర‌బాబు ఇక్క‌డ ఇద్ద‌రు ముస్లిం వ్యక్తుల‌కు రెండు కీల‌క ప‌ద‌వులు ఇచ్చారు. కాంగ్రెస్‌లో చేరిన నౌమాన్‌కు కార్పొరేష‌న్ ప‌ద‌వితో […]

బాబుకు మైండ్ బ్లాక్ అయ్యే షాక్‌… వైసీపీలోకి శిల్పా చ‌క్ర‌పాణి

ఏపీలో క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలుపుకోసం చావో రేవోలా పోరాడుతోన్న అధికార టీడీపీకి అదిరిపోయే షాక్ త‌గిలింది. గ‌త వారం రోజుల్లో అక్క‌డ టీడీపీకి వ‌రుస‌గా ఎదురు దెబ్బ‌లు త‌గులుతూనే ఉన్నాయి. ముందుగా టీడీపీకే చెందిన మాజీ ఎమ్మెల్యే సంజీవ‌రెడ్డి పార్టీ మారారు. ఇక నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఉన్న రాకేశ్‌రెడ్డి కూడా వైసీపీలో చేరారు. ఇక నిన్న టీడీపీకి చెందిన కౌన్సెల‌ర్ కూడా వైసీపీలో చేరిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా అక్క‌డ […]