విశాఖలో ఉప్పు నిప్పులా ఉన్న మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడికి పార్టీ అధినేత చంద్రబాబు గట్టి క్లాస్ పీకారు. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావుపై ఫైర్ అయ్యారు. `ఇక నిన్ను భరించలేను` అంటూ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో సఖ్యతగా ఉండకపోతే.. ఇక చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తే సహించబోనని స్పష్టంచేశారు. కొంతకాలం నుంచీ విశాఖలో గంటా వర్సెస్ అయ్యన్న వార్ జరుగుతోంది. అధినేత చంద్రబాబు ఎన్ని సార్లు వీరిద్దరినీ పిలిచి మందలించినా.. […]
Tag: tdp president
బాబు చతురతలో చిక్కుకున్న బీజేపీ.
వ్యూహ రచనలో ఏపీ సీఎం చంద్రబాబును మించిన వారు లేరనేది అందరికీ తెలిసిన విషయమే! మిత్ర పక్షం బీజేపీని కూడా తన చతురతతో ఇబ్బంది పెట్టి.. తెలివిగా పనులు చేయించుకుంటున్నారు. ఏపీ బీజేపీ నేతలు నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. అవి బీజేపీ అధిష్ఠానానికి ఏమాత్రం చేరకుండా చేయడంలో సఫలమవుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల టికెట్ల కేటాయింపుల్లోనూ బాబు చతురత బయటపడిందట. బీజేపీకి టికెట్ ఇవ్వలేదనే మాట నుంచి తనను కాపాడుకోవడానికి, ఇచ్చినా గెలుపొందలేకపోయారనే అపవాదు బీజేపీపై నెట్టేయడానికి సూపర్ […]
కడప తమ్ముళ్లకు సీరియస్ వార్నింగ్ అందుకేనా
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కంచుకోటను బద్దలు కొట్టాలని ఏపీసీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే వాటికి కార్యకర్తలు తూట్లు పొడుస్తున్నారు! ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది పోయి.. నిర్లక్ష్యం వహిస్తున్నారు. చంద్రబాబు ముందు ఒకలా.. ఆయన వెనుక మరోలా వ్యవహరిస్తూ దాగుడు మూతలు ఆడుతున్నారు. ఎంత చెప్పినా కడప నాయకుల తీరు మారకపోవడంతో.. చంద్రబాబు ఇక వారికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. నిర్లక్ష్యం వీడకపోతే.. ఇక ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. కడప జిల్లాపై సీఎం […]
బాబు దెబ్బకి ఏపీ మంత్రులకు నిద్ర పట్టడం లేదా..?
శివరాత్రి చేసుకునేందుకు కనీసంలో కనీసం మరో 20 రోజుల సమయం ఉంది. అయితే, ఇది సాధారణ జనాలకి. కానీ, ఏపీ మంత్రులకి మాత్రం శివరాత్రి జాగారం అప్పుడే వచ్చేసిందట!! అది కూడా నిత్యం తమ మధ్యే తిరుగాడే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చినబాబే మంత్రులకు శివరాత్రి తీసుకొచ్చారట! వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం అంటున్నారు ఒకరిద్దరు మంత్రులు! ముఖ్యంగా మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావులకు నిద్రమాత్రలేసుకున్నా.. […]
ఏపీలో టీడీపీ-వైసీపీ ఎమ్మెల్సీ ఆశావాహులు వీళ్లే
అధికార, విపక్ష అధినేతలకు త్వరలో సరికొత్త తలనొప్పి మొదలుకానుంది. వచ్చే నెలలో ఖాళీ కాబోతున్నఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పరీక్ష కానుంది. అనుభవం, సామాజికవర్గం.. ఇలా అన్ని విభాగాల్లో అధినేతను మెప్పించేందుకు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ మొదలైంది. మార్చిలో శాసనమండలిలో 22 స్ధానాలు ఖాళీ కాబోతున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయుల స్ధానాలతో పాటు, స్ధానిక సంస్ధలు, శాసనససభ్యుల కోటా నుంచి భర్తీ అయ్యే ఎమ్మెల్సీ సీట్ల కోసం పోరు తీవ్రంగానే ఉంది. ఇందులో టీడీపీకి 80 శాతం […]
బాబు నుంచి జూనియర్ భలే ఎస్కేప్… లేకుంటే ?
మనం అనుకుంటాం కానీ, అంతా ఆలస్యం అయిపోతోంది! అంతా ఆలస్యం అయిపోతోంది! అని!! ఒక్కొక్కసారి ఆ ఆలస్యమే.. ఎంతో మేలు చేస్తుందట! ఇప్పుడు ఇదే విషయం తారక్ విషయంలోనూ జరిగిందని తెలుస్తోంది. అదేంటంటే.. మొన్నామధ్య ఉధృతంగా తెరమీదకి వచ్చిన తమిళనాడులో జల్లికట్టు విషయం.. అందరికీ తెలిసిందే. దీనిపై సాధారణ ప్రజలు కోలీవుడ్ రోడ్ల మీదకి సైతం వచ్చి పోరాడారు. అదే సమయంలో కొందరు టాలీవుడ్ హీరోలు సైతం తమ స్టైల్లో స్పందించారు. మహేష్ బాబు, పవన్ ఇలా […]
టీడీపీకి, హోదా ఉద్యమానికి ఒకేసారి చెక్
ఏపీలో హోదా ఉద్యమం కేంద్రానికి తలనొప్పిగా మారింది! ప్రస్తుతం జల్లికట్టు కోసం తమిళ యువత చేసిన స్ఫూర్తి.. ఏపీ యువతకు ఆదర్శంగా మారింది. ఇప్పుడు ఏపీ ప్రజలు హోదా కోసం చేస్తున్న ఉద్యమం.. హోదా కోరుతున్న రాష్ట్రాల్లోని నాయకులకు స్ఫూర్తిగా మారితే కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. దీంతో పాటు ఏపీకి హోదా ఇస్తామని మాట మార్చిందని, ఇక తప్పని పరిస్థితుల్లోనే అప్పుడు బీజేపీతో జత కట్టామని టీడీపీ హ్యాండ్ ఇస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు […]
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో లోగుట్టు…!
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అటు కేంద్రం, ఇటు చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి వెనుక ఏదైనా దాగి ఉందా? నిజానికి విభజన చట్టంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా చంద్రబాబు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారా? ప్యాకేజీ తీసుకోవడం వెనుక ఏదైనా గుట్టు దాగి ఉందా? అంటే ఔననే అంటున్నారు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. నిన్న జరిగిన విశాఖ ఆందోళన విఫలం అనంతరం, దీనిపై కేవీపీ ఢిల్లీలో స్పందించారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడిన కేవీపీ.. చంద్రబాబు […]
టీఆర్ఎస్ తో పొత్తు పై కేంద్రం క్లారిటీ ఇచ్చిందా..!
అధికార టీఆర్ఎస్తో కలిసి అడుగులేయాలా? లేక పాత పద్ధతిలోనే టీడీపీతో జతకట్టాలా? అనే సందిగ్ధ పరిస్థితి తెలంగాణ బీజేపీ నాయకుల్లో నెలకొంది. ఒకపక్క సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. మరోపక్క కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధమవుతోంది. మరి ఇలాంటి విభిన్న పరిస్థితుల్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. తెలంగాణలో పర్యటన హీట్ పెంచుతోంది. దీంతో టీఆర్ఎస్-బీజేపీ పొత్తు పేచీ ఏ స్థాయికి చేరుతుందోననే సందేహం బీజేపీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. టీఆర్ […]