తమిళ రాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఎన్నో కలలు కంటున్న దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళకు భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. అసంతృప్తులందరినీ నయానో భయానో తన వైపు లాక్కుని తమిళ సీఎం పీఠంపై శశికళ కూర్చోబోతున్న వేళ.. ధర్మాసనం సంచలన ప్రకటన చేసింది. జయ అక్రమాస్తులకు సంబంధించిన కేసు తుది తీర్పును మరో వారంలోగా వెలువరిస్తామని ప్రకటించింది. దీంతో తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి! అత్యున్నత ధర్మాసనం ఇచ్చే తీర్పుపైనే శశికళ […]