2014లో ఓ ప్రభంజనం మాదిరిగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ ఎస్ పార్టీకి ముచ్చటగా మూడేళ్లు పూర్తయ్యాయి. మరో రెండేళ్లలో 2019 ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ ఇప్పటి నుంచే తన సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అదేసమయంలో ప్రజల్లో అధికార పార్టీకి, నేతలకు ఉన్న బలాబలాలను, అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో నే ఇటీవల నేతల పనితీరు ఆధారంగా సర్వే చేయించారు. గతంలోనూ ఒకసారి ఈ […]