ఎన్టీఆర్ వాయిస్‌తో అదిరిపోయిన `విరూపాక్ష` గ్లింప్స్..!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత త‌న త‌దుర‌పి చిత్రాన్ని ఇటీవ‌ల అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. సాయి ధ‌ర‌మ్ తేజ్ కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 15వ ప్రాజెక్ట్ ఇది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఈ మూవీకి సుకుమార్ కథనం అందించ‌డం విశేషం. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. […]