మ‌హేష్ మూవీకి ముహూర్తం పెట్టేసిన రాజ‌మౌళి.. `SSMB29` పట్టాలెక్కేది ఎప్పుడంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గుంటూరు కారం అనంతరం మహేష్‌ బాబు దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా చిత్రం ప్రారంభించబోతున్నాడు. మహేష్‌ కెరీర్‌లో రాబోతున్న 29వ చిత్రమిది. అలాగే రాజ‌మౌళి, మ‌హేష్ బాబు కాంబోలో వ‌స్తున్న ఫ‌స్ట్ ప్రాజెక్ట్ కావ‌డంతో అభిమానుల్లో అంచ‌నాలు భారీగా […]