కర్నూలు జిల్లా నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం.. అటు టీడీపీని, ఇటు వైసీపీ నేతలను తీవ్రంగా కలిచివేస్తోంది. ఆయన లేరన్న వార్త అందరినీ శోకసంద్రంలో నింపేస్తోంది! నాగిరెడ్డి మృతి చెందిన విషయాన్ని ఆయన బావమరిది ఎస్వీ మోహన్ రెడ్డి ధ్రువీకరించారు. ముఖ్యంగా ఆయన గుండెపోటుతో మృతిచెందారన్న విషయం.. అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మరి పెద్ద వయస్సు కాకపోయినా భూమా 53 సంవత్సరాల వయస్సులోనే ఇంత త్వరగా మృతి చెందడానికి నాలుగు కారణాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. […]