తెలంగాణలో ఉనికిని చాటుకునేందుకు ముప్పుతిప్పలు పడుతోన్న టీడీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. తెలంగాణలోని పాత ఆదిలాబాద్ జిల్లాలో టీడీపీలో బలమైన నాయకుడిగా గుర్తింపు ఉన్న మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఈ నెల 29న టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. రమేష్ రాథోడ్ ఆదిలాబాద్ ఎంపీగా పనిచేయగా, ఆయన భార్య సుమన్ రాథోడ్ ఖనాపూర్ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో రమేష్ రాథోడ్ ఆదిలాబాద్ ఎంపీగాను, ఆయన తనయుడు రితీష్ […]