తూర్పుగోదావరి జిల్లాలో బలపడాలని భావిస్తున్న వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో నాయకత్వ సమస్యలు పార్టీని వెంటాడుతున్నాయి. కీలక నేత పిల్లి సుభాష్చంద్రబోస్ నాయకత్వంపై శ్రేణులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక, సొంత సామాజికవర్గం గల వార్డుల్లో ఓటమి చెందడం.. ఇవన్నీ ఆయన నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇక వైసీపీలో పిల్లి బోస్ పని అయిపోయిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ సుభాష్చంద్రబోస్ శల్యసారథ్యంలో స్వంత నియోజకవర్గం రామచంద్రపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ […]