తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటీ…?

పోలింగ్ చివరి వారం కాంగ్రెస్ కి కలిసి రానుందా? ఆ ఏడు రోజులు కాంగ్రెస్ కీలక నేతలంతా తెలంగాణలో ఉండనున్నారా? ఆపరేషన్ తెలంగాణ పేరుతో సునీల్ కనుగోలు కొత్త అస్త్రాన్ని వదలనున్నరా? పరిస్థితి చూస్తుంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అధిష్టానం కసరత్తు చేస్తోంది. తెలంగాణ రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో తామే గెలుస్తామనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు హస్తం నేతలు. మరో వైపు కాంగ్రెస్ […]

టీ కాంగ్రెస్‌కు రాహుల్ పర్యటన లాభమా… నష్టమా…?

రాహుల్ గాంధీ బస్సు యాత్ర… టీ కాంగ్రెస్‌కు మంచి బూస్టప్‌ ఇచ్చిందా? గులాబీ కంచుకోటను బ‌ద్దలు కొట్టే శ‌క్తి హ‌స్తానికి ఉందా? ఎన్నిక‌ల ఎజెండాను సెట్ చేయ‌డంతో పాటు స్థానిక సమస్యలను పరిష్కరిస్తామన్న హస్తం నేతల మాటలు అక్కడ ఓట్లు రాలుస్తాయా? ఇంతకి బ‌స్సు యాత్ర లక్ష్యం నెరవేరిందా? రాహుల్ బస్సు యాత్ర… తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ పెంచిందని పార్టీ నేతలు భావిస్తున్నారు. మూడు రోజులపాటు కొనసాగిన రాహుల్ టూర్ కాంగ్రెస్ ఇమేజ్‌ను మ‌రింత‌ పెంచిందని రాజకీయ […]

కాంగ్రెస్ టార్గెట్ ఫిక్స్..కలిసొస్తుందా?

తెలంగాణలో ఎన్నికల నగారా మోగించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ నెల 17 నుంచి ఎన్నికల శంఖారావం పూరించనుంది. పైగా జాతీయ నేతలంతా తెలంగాణకు రానున్నారు. సీడబ్ల్యూసీ పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలి సమావేశాన్ని ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహిస్తున్నారు. అది కూయ హైదరాబాద్ లో ఈ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలతో పాటు..కాంగ్రెస్ కీలక నేతలంతా ఈ సమావేశాల్లో పాల్గొనున్నారు. అలాగే 17వ తేదీన బహిరంగ సభ […]

రాజద్రోహం చట్టానికి కేంద్రం చెల్లుచీటీ… ఇకపై దేశ ద్రోహ చట్టం…!

రాజద్రోహం చట్టానికి కేంద్ర ప్రభుత్వం చెల్లుచీటీ పాడింది. నేర న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. మూక దాడులకు మరణశిక్ష తప్పదని హెచ్చరించింది. కోర్టులో వాదనలు పూర్తయిన నెల రోజుల్లో తీర్పు చెప్పాలని సూచించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ఆఖరిరోజున ప్రభుత్వం దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టింది. 17 రోజుల్లో 44 గంటలకుపైగా లోక్‌సభా కార్యకలాపాలు సాగినట్లు స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లా వెల్లడించారు. మరో పక్క అవిశ్వాస తీర్మానంపై మోదీ రెండు గంటలు మాట్లాడితే అందులో […]

రాహుల్‌కు కౌంటర్లు..రేవంత్ తగ్గట్లేదు.!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ వచ్చిన విషయం తెలిసిందే.ఆ పార్టీలోకి చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇటీవలే పొంగులేటి, జూపల్లిలతో పాటు 50 మంది వరకు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. అలాగే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు..రాహుల్ గాంధీ సభలో పాల్గొన్నారు. ఇక బి‌ఆర్‌ఎస్..బి‌జే‌పి బీటీమ్ అంటూ విమర్శలు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని పలు హామీలని ప్రకటించింది. ఇలా అనూహ్యంగా కాంగ్రెస్ రేసులోకి దూసుకొచ్చి దూకుడు మీద ఉంది. […]

రాహుల్‌తో హస్తం జోరు..కేసీఆర్‌ని నిలువరిస్తారా?

మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. చాలా రోజుల తర్వాత ఆ పార్టీలో జోరు పెరిగింది. ఇటీవల కర్నాటక ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణలో కూడా అనూహ్యంగా రేసులోకి వచ్చిన ఆ పార్టీకి కొత్త చేరికలు భారీ ప్లస్ అవుతున్నాయి. ఇదే క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి వారు…కాంగ్రెస్ లోకి రావడంతో సీన్ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చేలా ఖమ్మంకు రాహుల్ గాంధీ వచ్చారు. ఖమ్మంలో జరిగిన సభలో […]

ఖమ్మంకు రాహుల్..కాంగ్రెస్‌లో రచ్చ మొదలు.!

అంతా బాగుదనుకునే సమయంలో ఏదొక చిచ్చు చెలరేగడం కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా మారిపోయింది. ఆ పార్టీ ఇప్పుడుప్పుడే సెట్ అవుతుంది. భారీ చేరికలతో మంచి జోష్ నెలకొంది. ఇంకా బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టే దిశగా కాంగ్రెస్ ముందుకెళుతుంది. తాజాగా రాహుల్ గాంధీతో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు..పొంగులేటి, జూపల్లిలతో పాటు 35 మంది నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. దీంతో పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది. ఇక జులై 2 ఆదివారం ఖమ్మంలో భారీ సభ జరగనుంది. […]

మోదీ..డైరక్ట్ కేసీఆర్‌ని ఎందుకు టార్గెట్ చేశారు.!

విపక్షాల ఐక్యతతో దేశంలో బి‌జే‌పికి కాస్త ఇబ్బందులు మొదలైనట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కేంద్రంలో తిరుగులేని పొజిషన్ లో ఉన్న మోదీ సర్కార్‌కు విపక్షాల ఐక్యత రూపంలో ఓ భారీ కుదుపు కనిపిస్తుంది. విపక్షాల కూటమి కట్టడాన్ని మోదీ తెలిగా వదిలేస్తున్నట్లు లేరు. విపక్షాలు అదే విధంగా కలిసి ముందుకెళితే రానున్న కాలంలో తమకే ఇబ్బంది అని అర్ధమైంది. అందుకే డైరక్ట్  విపక్షాలని మోదీ టార్గెట్ చేశారు. తాజాగా భోపాల్ లో బీజేపీ బూత్ లెవెల్ నేతలు, కార్యకర్తలతో […]

రేసులోకి రాహుల్..మోదీకి రిస్క్ పెరుగుతుందా?  

కేంద్ర రాజకీయాల్లో సీన్ మారుతుంది..ఇప్పటివరకు తిరుగులేని ఆధిపత్యంతో కొనసాగుతున్న బీజేపీకి..ధీటుగా కాంగ్రెస్ ఎదుగుతుంది. గత రెండు ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న కాంగ్రెస్..ఈ సారి ఎన్నికల్లో బి‌జే‌పికి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. అయితే ఇంకా విపక్షాల మద్ధతు తోడైతే బి‌జే‌పికి చెక్ పెట్టడం పెద్ద కష్టం కాదనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం వస్తున్న సర్వేల్లో బి‌జేపికి ఆధిక్యం ఉన్నా..నిదానంగా అది తగ్గేలా ఉంది. తాజాగా ఎన్డీటీవీ–లోక్‌నీతి–సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌(సీఎస్‌డీఎస్‌) […]