ఏపీ రాజకీయాల్లో షాకింగ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు అధికార టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను, నాయకులను తన పార్టీలో చేర్చేసుకుంది. అయితే గత కొద్ది రోజులుగా ఇతర పార్టీలకు చెందిన సీనియర్లు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధుల వారసులు వరుసగా జగన్ గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొప్పన మోహన్రావు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక ఇప్పుడు వంతు కర్నూలు జిల్లాకు […]
Tag: pulivendula mla
పవన్ కు చెక్ చెప్పేలా జగన్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య ఆసక్తికరమైన పోరు నడుస్తోంది. ఈసారి ఎలాగైనా ప్రజల మనసు గెలుచుకుని అధికారాన్ని సొంతం చేసుకోవాలని ఒకరు దృఢ నిశ్చయంతో ఉంటే.. మరొకరు తమ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి భావి నాయకుడిగా ఎదగాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ వ్యూహాలతో మునిగితేలుతూ.. బలాన్ని పెంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా గుంటూరులో పవన్ పర్యటిస్తుండటంతో.. అంతకు ముందుగానే జగన్ అక్కడ పర్యటిస్తుండటంతో మరోసారి ఆసక్తికర […]
వైకాపాలో జగన్ సరికొత్త వ్యూహం
వైకాపాను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా.. ప్రజా సమస్యలపై మరింతగా గళం విప్పేలా, రానున్న ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని మరింతగా బలం పెంచేందుకు జగన్ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీకి ఉన్న క్షేత్రస్తాయి బలం వైకాపాకి లేదు. ముఖ్యంగా మహిళా విభాగం బలహీనంగా ఉంది. పైకి ఒక్క రోజా తప్ప ఎవరూ లేరు. అదేవిధంగా యువజన విభాగం కూడా పెద్దగా యాక్టివ్గా లేదు. ఈ నేపథ్యంలో జగన్ ఈ రెండు విభాగాలను బలోపేతం […]
వైసీపీ ఎంపీగా ముద్రగడ పద్మనాభం..!
ఇంకా రెండేళ్లు ఉండగానే వైసీపీలో టికెట్ల ముసలం మొదలైంది. ముఖ్యంగా ఎలాగైనా ఈసారి పట్టు సాధించాలని చూస్తున్న గోదావరి జిల్లాల్లోనే ఈ రచ్చ ప్రారంభమైంది. కాపు ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న ఈ వ్యవహారం ఆ పార్టీ అధినేత జగన్కు తలనొప్పిగా మారింది. కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సునీల్ స్థానంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ తరఫున పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. దీంతో ఈసారి కూడా […]