ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాలు తీవ్ర వివాదానికి కారణమైన విషయం తెలిసిందే. నందులకు కులాలను కూడా ముడిపెడుతూ కామెంట్లు వచ్చాయి. ఇక, రాజకీయాలతోనూ నందులను ముడిపెట్టి ఏకేశారు. ఇక, ఈ వివాదం సర్దుమణుగుతుందని అనుకుంటున్న తరుణంలో సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్.. చేసిన కామెంట్లు చల్లారుతున్న మంటను ఎగదోసినట్టయింది! సోమవారం ఆయన నంది అవార్డులపై కామెంట్లు చేశాడు. ఎక్కడో(హైదరాబాద్)లో ఉండి నందులపై కామెంట్లు చేయడం కాదు అంటూ హీరోలు, దర్శకులు, నిర్మాతలపై కామెంట్లు కుమ్మరించాడు. […]