ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు కొద్ది సేపటి క్రితమే ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ ప్రక్రియ షురూ కాగా.. సినీ ప్రముఖులు ఒక్కోక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే పోలింగ్ కేంద్రం ఎదుట మీడియా ముఖంగా పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ మాట్లాడుతూ.. తిప్పి కొడితే 900 ఓట్లు ఉన్నాయి. […]
Tag: polling
నేడే ఓట్ల లెక్కింపు..అందరి దృష్టి ఆ రాష్ట్రంపైనే?!
దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ఉదయం 8.00 గంటలకు ప్రారంభం కానుండగా.. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలను తెరిచి లెక్కించనున్నారు. ఇప్పటికే కౌంటింగ్కు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే ఎన్నికలు జరిగిన […]
ఈసీ కి కీలక సూచనలు ఇచ్చిన మమతా..!?
దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ రాత్రి పూట కర్ఫ్య ఇంకా వీకెండ్ లాక్ డౌన్ లు అమలు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ విజృంభణ ఎక్కువగా ఉండటంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల సంఘానికి కొన్ని కీలక సూచనలు ఇచ్చారు. కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో మొత్తం ఎనిమిది దశల పోలింగ్ […]
తెలంగాణలో పురపోరకు మోగిన నగారా..
తెలంగాణ రాష్ట్రంలో పురపోరు మొదలైంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ పర్వం మొదలుకానుంది. అదే రోజున రిటర్నింగ్ అధికారులు తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు. ఈ నెల 18న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు. 19న నామినేషన్ల పరిశీలన ఉండగా… 20న తిరస్కరించిన నామినేషన్లపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 21న […]
ఓటేసేందుకు వచ్చి అభిమాని ఫోన్ లాక్కున్న అజిత్..వీడియో వైరల్!
తమిళనాడు రాష్ట్రంలో నేటి ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికలు జోరుగా కొనసాగుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయగా.. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా త్వరత్వరగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. భార్య షాలినీ కుమార్తో పాటు ఓటు వేసేందుకు తిరువాన్మయూర్ కి ఉదయాన్నే వచ్చారు. అయితే ఈ విషయంలో తెలుసుకున్న స్థానికులు, అభిమానులకు […]