నవ్యాంధ్రప్రదేశ్కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబుకు పెద్ద షాక్ తగిలింది. 2019 ఎన్నికలకు ముందుగానే ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోను పూర్తి చేయాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం పనులపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఆయన ప్రాజెక్టు స్పిల్ వే పనుల కోసం మరోసారి అట్టహాసంగా శంకుస్థాపన కూడా చేశారు. ప్రాజెక్టు తొలిదశ పనులను 2018 కు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు కోసం సీఎం చంద్రబాబుతో పాటు ఇరిగేషన్ […]