ప్లీనరీ వేదికగా వైసీపీ అధినేత జగన్ 2019 ఎన్నికలకు సమరభేరి మోగించారు. అన్ని వర్గాలకు చేరువయ్యేలామొత్తం తొమ్మిది పథకాలు ప్రకటించేశారు. దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటి అమలు ఎంత వరకూ సాధ్యమనే దానిపైనే ఇప్పుడుచర్చ మొదలైంది. అలవికాని హామీలిచ్చి.. వాటిని నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు ఎన్ని కప్పగంతులు వేస్తున్నారో తెలిసిందే! ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీల అమలు సాధ్యమయ్యేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పథకాలకు ఎంత ఖర్చు అవుతుంది. అంతంతమాత్రంగా ఉన్న రాష్ట్ర ఆదాయ పరిస్థితి. […]