టీడీపీలో ఒక్క‌టైన బ‌ద్ధ శ‌త్రువులు

క‌డ‌ప జిల్లాలో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు పుట్టినిల్లుగా  జమ్మలమడుగు నియోజ‌క‌వ‌ర్గాన్నిచెప్పుకోవాలి. ఇక్క‌డ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి… ఇటీవ‌ల టీడీపీ తీర్థం పుచ్చుకున్న‌..ఆదినారాయణరెడ్డి,  మొద‌టినుంచి టీడీపీనే న‌మ్ముకున్న మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి కుటుంబాల మ‌ధ్య ద‌శాబ్దాల వైర‌ముంది. అందుకే ఆదినారాయ‌ణ‌రెడ్డి టీడీపీ లోకి రావ‌డాన్ని… రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గం తీవ్రంగా వ్య‌తిరేకించింది. చంద్ర‌బాబు రాజ‌కీయ చాణ‌క్య‌మో… లేక ఈ  జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు వ్యూహ చ‌తుర‌తో తెలియ‌దుగానీ విప‌క్ష అధినేత జగ‌న్ సొంత‌ జిల్లాలో ప‌రిణామాలు […]