ఎక్కడైనా సరే అధికార పార్టీకి, మంత్రులకు ప్రతిపక్ష నేతలు లేఖలు రాయడం, విజ్ఞప్తులు చేయడం చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం మంత్రినే ప్రతిపక్ష నేతకు బహిరంగ లేఖ రాశాడు. అదికూడా ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసేందుకు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ లేఖ రాసింది ఎవరంటే తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మరి ఎవరికి రాశాడంటే రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఇప్పుడిది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. […]