యువగళం జోరు..టీడీపీకి కొత్త ఊపు.!

ఎట్టకేలకు నారా లోకేష్ యువగళం పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైంది. పెద్ద ఎత్తున టి‌డి‌పి నేతలు, శ్రేణులు పాదయాత్రలో పాల్గొని సక్సెస్ చేశారు. అటు లోకేష్ ప్రజలని కలుసుకుంటూ ముందుకెళ్లారు. పాదయాత్రలో బాలయ్య, తారకరత్న కూడా పాల్గొన్నారు. అయితే తారకరత్నకు గుండెపోటు రావడంతో..ఆయన్ని కుప్పం హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బెంగళూరు నుంచి వైద్యులని తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లే తెలుస్తోంది. హాస్పిటల్ వద్ద బాలయ్య ఉండి మొత్తం చూసుకుంటున్నారు. […]