తెలంగాణ అధికార పార్టీలో ఒకే కుటుంబం నుంచి మంత్రులుగా ఉన్న వారు కేటీఆర్, హరీశ్రావు. ఇద్దరూ కూడా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కి ఒకరు కొడుకు, మరొకరు మేనల్లుడు! అయితే, ఇటవల కాలంలో హరీశ్ రావు హవా పెరుగుతోందని కొన్ని ప్రైవేటు సర్వేలు చాటాయి. దీనికి మిషన్ భగీరథ, కాకతీయ మిషన్ వంటి కార్యక్రమాలు భారీగా తోడ్పడ్డాయని కూడా కథనాలు వచ్చాయి. ఇక, అదేసమయంలో.. కేసీఆర్ కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్ ఒకింత వెనుకబడ్డారనే వార్తలు వచ్చాయి. […]