ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం.. అధికార సంస్థలను ఎంతగా నిర్వీర్యం చేస్తోందో చెప్పడానికి తాజా అసెంబ్లీ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యంగా క్షణం కూడా తీరికలేని సీఐడీ వంటి సంస్థలను అర్థం పర్థం లేని విషయాలపై విచారణకు నియమిస్తుండడం ప్రస్తుతం వివాదానికి దారితీస్తోంది. అధికార పక్షం ఈగోకు పోతుండడం వల్ల విలువైన ప్రజాధనం కూడా దుర్వినియోగం అవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇటీవల కురిసిన భారీ వర్షానికి అసెంబ్లీలో విపక్షనేతకు కేటాయించిన చాంబర్ లోకి నీళ్లు వచ్చాయి. ఇది […]