తమిళనాడు రాజకీయాల్లో అత్యంత వేగవంతమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత మరణంతో ఆ పార్టీ ఒంటరి అయిపోయింది. అమ్మకు ముందు చూపు లేకపోవడంతో పార్టీకి వారసుడిని తయారు చేయని ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పార్టీని ఎవరు నడిపించాలని, ప్రభుత్వాన్ని ఎలా డీల్ చేయాలి? అనే సందేహాలకు సమాధానం దొరకకపోగా.. నేనంటే నేనంటూ అమ్మ పార్టీకి వారసులు పుట్టగొడుగులా తయారయ్యారు. దీంతో అన్నాడీఎంకేలోని ఎమ్మెల్యేలు కట్టుతప్పుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి […]