కాపు ఉద్యమ ప్రభావం నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉంటుందని భావించినా.. వారంతా టీడీపీకి పట్టం కట్టారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు ఇచ్చిన హామీలో భాగంగా.. వారి అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటుచేశారు. ఆశించిన స్థాయిలో లక్ష్యాలు అందుకునేలా చేయడంలో కార్పొరేషన్ విఫలమైంది. దీంతో పాటు ఈ కార్పొరేషన్లో అవకతవకలు కూడా చోటు చేసుకుంటుండటంతో దీని ప్రక్షాళనపై సీఎం దృష్టిసారించారు. కీలకమైన కాపు కార్పొరేషన్ చైర్మన్ […]