రాజమండ్రి టీడీపీలో లుకలుకలు… సీట్ల పంచాయతీ తేలేనా….!?

ఏపీలో ఎన్నికలకు సమయంలో దగ్గర పడుతుండటంతో అన్ని రాజకీయా పార్టీలు ఎన్నికలపై దృష్టి పెట్టేశాయి. వాస్తవానికి ఏడాది ముందు నుంచే ప్రతిపక్షాలు ప్రచారం కూడా మొదలుపెట్టేశాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ప్రస్తుతం రాజకీయాలు మరింత హాట్‌గా మారాయనేది వాస్తవం. చంద్రబాబు అరెస్టుతో వచ్చిన సానుభూతి తప్పకుండా తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని వైసీపీ నేతలు వెల్లడిస్తున్నారు. […]