సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె, ధనుస్ మాజీ సతీమణి ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆమె ఇంట్లో లక్షలు విలువ చేసే నగలు చోరీకి గురయ్యాయి. దాంతో ఐశ్వర్య పోలీసులను ఆశ్రయించింది. చెన్నైలోని తన నివాసం నుంచి 480 గ్రాముల బంగారం, వజ్రాభరణాల జ్యుయలరీ చోరీకి గురైనట్టు తెయాన్ మెట్ పోలీసులకు ఐశ్వర్య ఫిర్యాదు చేశారు. లాకర్ లో ఉంచినవి కనిపించడం లేదని ఆమె పేర్కొన్నారు. 2019లో తన చెల్లి సౌందర్య పెళ్లి సమయంలో […]