ఐవైఆర్ కృష్ణారావు. విభజన తర్వాత ఏపీ ప్రభుత్వానికి తొలి ప్రధాన కార్యదర్శి. దాదాపు రెండున్నరేళ్లపాటు ఆయన ఏపీకి సేవలందించారు. ఆయనంటే అటు ప్రభుత్వంలోనూ, ఇటు మంత్రుల్లోనూ గౌరవం ఉంది. చాలా సీనియర్ అధికారిగా, విచక్షణ ఉన్న అధికారిగా కూడా ఆయనకు మంచి మార్కులు ఉన్నాయి. అందుకే చంద్రబాబు ఆయనను రిటైర్ అయిన తర్వాత కూడా వినియోగించుకోవాలని భావించారు. అంతేకాదు, ఆయన సూచనల మేరకు బ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి దేశ చరిత్రలో ఇప్పటి వరకు లేని కొత్త […]