ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే అందరూ ఖచ్చితంగా చంద్రబాబునాయుడి వైపే చూస్తారు. ఎందుకంటే భాగ్యనగరానికి ఐటీ కంపెనీలను తీసుకురావడంలోను, హైదరాబాద్ను సైబరాబాద్గా మార్చడంలోను చంద్రబాబునాయుడు చూపిన చొరవ, చేసిన కృషి అంత త్వరగా ఎవరూ మరచిపోలేరు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రతి పల్లెనుంచీ పదుల సంఖ్యలో ఐటీ నిపుణులు దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచం నలుమూలలా పని చేస్తున్నారంటే అది ఖచ్చితంగా చంద్రబాబు చలవే. అయితే, తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఏపీలో కేవలం ఏవో […]