దేశంలోనే పెద్ద రాష్ట్రమైన యూపీలో బీజేపీ విజయం ఆ పార్టీకి ఎక్కడ లేని జోష్ ఇచ్చింది. గతంలో చాలా రాష్ట్రాల్లో ఉనికిని చాటుకునేందుకు సైతం ఇబ్బందిపడిన బీజేపీ ఇప్పుడు ఇతర పార్టీల సహకారం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 2019లో సైతం జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల అవసరం లేకుండానే కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పుడు ఇదే మంత్రాన్ని ఏపీలోను ప్రయోగించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్లాన్లు వేస్తున్నారట. […]