మహారాష్ట్ర రాజధాని ముంబైలో పొలిటికల్ సీన్ మారుతోంది! మళ్లీ పాత రోజులు తెరమీదకి వస్తున్నాయి. బీజేపీ, శివసేనలు కలిసి పాలించేందుకు రెడీ అవుతున్నాయి. ఇటీవల మూడు రోజుల కిందట ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో బీజేపీ సత్తా చాటినా.. శివసేన కూడా బీజేపీకి గట్టి పోటీగానే నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల్లో దేనికీ మేయర్ పీఠం దక్కించుకునేంత మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు మళ్లీ పాతమిత్రులు కలవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. […]