ప్రజాక్షేత్రంలోకి జనసేనను తీసుకెళ్లేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ సిద్ధమయ్యారు. టీడీపీ ప్రభుత్వంతో అమీతుమీకి సిద్ధమవుతున్న ఆయన మరో అడుగు ముందుకేశాడు. జనసేనాని మరోసారి గర్జించాడు. టీడీపీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశాడు. ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగాడు. కిడ్నీ సమస్యలపై స్పందించకుంటే ప్రజా ఉద్యమం లేవదీస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. శ్రీకాకుళం జిల్లాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పర్యటించారు. ఉద్దానం సహా 11 మండలాల్లో కిడ్నీ వ్యాధి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంపై నిప్పులు చెరిగారు. దీనిని ఘోర విపత్తుగా […]