నిర్మాత ఎం.ఎస్‌. ప్రసాద్‌ మృతి..!

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. నిన్నటి రాత్రి ప్రముఖ నిర్మాత మర్రిపాటి సత్యనారాయణ ప్రసాద్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యపాలైన ఆయన గుండెపోటుతో చెన్నైలో కన్ను మూశారు. సినీ ఇండస్ట్రీలో ఈయన పలు విజయవంతమైన సినిమాలను నిర్మించారు. చిత్ర పరిశ్రమలో ఎం.ఎస్‌. ప్రసాద్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1945 జూలై 18న మచిలిపట్నంలో జన్మించిన సత్యనారాయణ ప్రముఖ దర్శకుడు అయిన ఆదుర్తి సుబ్బారావు బావగారు. సుబ్బారావుతో కలిసి కృష్ణ హీరోగా ‘మాయదారి మల్లిగాడు’, ‘గాజుల కిష్టయ్య’ చిత్రాలు నిర్మించారు. […]