పాపం ఈ జంపింగ్ లు అభివృద్ధి కోసమేనట..హవ్వ..

నల్గొండ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్యేలు భాన్కర్ రావు, రవీంద్రనాయక్ తాము అధికార‌ టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరుతున్న‌ట్లు ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగ‌స్వాములం కావాల‌నే టీఆర్ఎస్‌లో చేరుతున్నామని సెలవిచ్చారు. తాము ఎల్లుండి సీఎం కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి మాట్లాడుతూ కాంగ్రెస్‌ను వీడుతుండ‌డం తమకు బాధ క‌లిగిస్తోంద‌ని అన్నారు. కాంగ్రెస్‌లోని అంతఃక‌ల‌హాల‌తో తాము మ‌నో వేద‌న‌కు గుర‌య్యామ‌ని […]