అన్ని వర్గాల వారికీ సమ ప్రాధాన్యం ఉంటుందని, ఏ వర్గానికీ అన్యాయం జరగదని సీఎం చంద్రబాబు పదేపదే స్పష్టం చేస్తుంటారు. కానీ ఇది మాటలకే పరిమితమైందనే వార్తలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ, ప్రభుత్వంలో బీసీ, దళితులకు చంద్రబాబు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొన్ని వర్గాలనే ఆయన అక్కున చేర్చుకుంటున్నారని ఆయా వర్గాల నేతలు వాపోతున్నారు. ముఖ్యంగా మంత్రి వర్గ విస్తరణలో తమ వర్గాల వారికి అన్యాయం జరిగిందని […]