కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `గుడ్ లక్ సఖి`. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు నాగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి షూటర్గా అలరించబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో ఈ సినిమాకు మోక్షం కలిగింది. […]