పశ్చిమగోదావరి జిల్లాలోని గరగపర్రు ప్రస్తుతం అట్టుడుకుతోంది. అక్కడ దళితవర్గాలకు చెందిన వారిని వెలివేశారన్న వార్తలతో ఆ గ్రామం పేరు ఇప్పుడు మీడియాలో మార్మోగుతోంది. గరగపర్రులో దళితులంతా ఉద్యమిస్తుంటే ఇప్పుడు అదే జిల్లాలోని పాలకొల్లు కేంద్రంగా బీసీలంతా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు యాంటీగా ఒక్కటవుతున్నారు. నియోజకవర్గంలో కొద్ది రోజులుగా జరుగుతోన్న పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని బీసీలతో పాటు కోనసీమలో బలహీనవర్గాల్లో బలమైన ఓ ప్రధాన సామాజికవర్గం మొత్తం నిమ్మలకు వ్యతిరేకంగా గళమెత్తుతోంది. నిమ్మల పాలకొల్లు నియోజకవర్గంలో […]