తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి ఉత్కంఠ పరిణామాలతో ఎట్టకేలకు సమసిపోయింది. జయ నెచ్చెలి శశికళ సీఎం పీఠం ఎక్కాలన్న ఆశలు అడియాసలయ్యాయి. ఇక ఇప్పుడు సీఎం పీఠం రేసులో అమ్మ నమ్మినబంటు పన్నీరుసెల్వం వర్సెస్ చిన్నమ్మ నమ్మినబంటు పళనిస్వామి మాత్రమే ఉన్నారు. శశికళకు అక్రమాస్తుల కేసులో నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పడడంతో రేపోమాపో ఆమెను పోలీసులు అరెస్టు చేయడం ఖాయం. ఇక ఇప్పుడు శశికళకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుంది. పళనిస్వామికి మద్దతు ఇస్తే […]