కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా చేపట్టనున్న సత్యాగ్రహ పాదయాత్రపై చంద్రబాబు ప్రభుత్వం అష్టదిగ్బంధనం ప్రకటించిందా? గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా పద్మనాభం తన యాత్రను వాయిదా వేసుకోక తప్పని స్థితి వస్తోందా? ప్రభుత్వం గతంలోకన్నా మరింత ఎక్కువ కఠినంగా వ్యవహరిస్తోందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. కాపు ఉద్యమానికి ముఖ్యంగా ముద్రగడ ఉద్యమానికి ఎలాంటి ఆదరణా లభించకూడదన్న ఏకైక అజెండాతో చంద్రబాబు ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేసింది. ఈ క్రమంలో తాజాగా పద్మనాభం చేపడతానని […]