శశికళ వర్గంపై పోరు ఆగదు … పన్నీరు సెల్వం కొత్త పార్టీ

మ‌డ‌మ తిప్పే అవ‌కాశం లేదంటున్నారు త‌మిళ‌నాడు మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వం! శశిక‌ళ వర్గంపై పోరు ఆగ‌దు అని స్ప‌ష్టం చేస్తున్నారు. అసెంబ్లీలో జ‌రిగిన బ‌ల‌ప‌రీక్ష‌లో ప‌ళ‌నిస్వామి విజ‌యం సాధించ‌డంతో.. త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై ప‌న్నీర్ వ్యూహాలు ర‌చిస్తున్నారు. త‌న‌పై వేటు ప‌డ‌టం ఖాయ‌మ‌ని నిర్ణ‌యించుకున్న ఆయ‌న‌.. స‌రికొత్త రాజ‌కీయ వేదిక‌ను ఏర్పాటుచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అన్నాడీఎంకేలో కొన‌సాగ‌లేక‌.. డీఎంకేలో చేరే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో సొంతంగా పార్టీ పెట్టాల‌ని నిర్ణయించుకున్నార‌ట‌. పార్టీ పేరు, గుర్తు కూడా ఖరారుచేసిన‌ట్టు […]