లక్షల కోట్లలో ఎంవోయూలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడుల వరద ఖాయం. ఇక లక్షల సంఖ్యలో ఉద్యోగాలు తన్నుకుంటూ వచ్చేస్తాయి! అంటూ ఒక పక్క ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపుతోంది!! ఇప్పటికి రెండు సార్లు ఏపీలో పారిశ్రామిక సదస్సు జరిగింది. దేశవిదేశాలకు చెందిన కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ కూడా కుదుర్చుకుంటున్నాయి. మరి ఇవి అమలవుతున్నాయా? ఎంవోయూ కుదుర్చుకున్న కంపెనీలన్నీ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయా? అంటే లేదనే చెప్పాలి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న పర్యాటక శాఖలోని వ్యవహారం […]