గోదావరి నేతలకు బాబు క్లాస్ అందుకేనా..!

ఎప్పుడూ ప్ర‌శాంతంగా ఉండే గోదావ‌రి జిల్లాలు ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను మార్చ‌గ‌ల నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా మారాయి. 2014 ఎన్నిక‌ల్లో గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు టీడీపీకి అండ‌గా నిలిచాయి. ముఖ్యంగా ప‌శ్చిమ గోదావ‌రిలో క్లీన్ స్వీప్ సాధించింది, అయితే ఈ మూడేళ్ల‌లో రెండు జిల్లాల్లోనూ టీడీపీ వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌. జిల్లాల్లోని ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించి ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దాల‌ని త‌న దగ్గ‌ర‌కు వ‌చ్చిన గోదావ‌రి జిల్లాల నేత‌లకు గ‌ట్టిగా చెబుతున్నార‌ని స‌మాచారం! విభ‌జ‌న […]