తమిళనాడు సీఎం అయ్యేందుకు జయ నెచ్చెలి శశికళ గత కొద్ది రోజులుగా వేస్తోన్న ఎత్తులు, పన్నుతున్న వ్యూహాలు మామూలుగా లేవు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను సీక్రెట్గా బీచ్ రిసార్ట్స్లో ఉంచి శిబిరం నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సీఎం అవ్వాలని కలలు కంటోన్న శశికళ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీకే శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. ఈ కేసులో శశికళతో పాటు మరో ముగ్గురిని కూడా దోషులుగా సుప్రీంకోర్టు […]