కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. ప్రస్తుతం తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సమైక్య వాదాన్ని పార్లమెంటులో వినిపించిన ఆయన.. రాష్ట్రం రెండు ముక్కలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించి.. దానికి కట్టుబడి ఉన్న విషయం తెలిసిందే! అయితే ప్రస్తుతం లగడపాటి ఇంట్లో పెళ్లి భాజాలు మోగే సమయం వచ్చింది. ఆయన ఇద్దరు కుమారులకు ఒకేసారి ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు హైదరాబాద్లోని పార్క్ హయత్ వేదిక కాబోతోంది. […]