టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. అందరూ జాగ్రత్తగా ఉండాలని, సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించాడు. వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కోసం భారత జట్టు త్వరలోనే ఇంగ్లాండ్ కు వెళ్లనుంది. ఆలోపే ఆ టూరుకు వెళ్లే భారత జట్టులోని ఆటగాళ్లందరూ తమ తొలి డోసు వ్యాక్సిన్ తీసుకోవాలని […]