మళ్ళీ ముంచేసిన జానారెడ్డి.

మాజీ మంత్రి జానారెడ్డి కాంగ్రెస్‌ పార్టీని మళ్ళీ మళ్ళీ ముంచేస్తూనే ఉన్నారు. ఏ వేదిక అయినాసరే ఆయనలోని టిఆర్‌ఎస్‌ అనుకూల భావాలు చాలా తేలిగ్గానే బయటకు వచ్చేస్తున్నాయి. అసెంబ్లీలో అయినా, పార్టీ వేదికలపైనా జానారెడ్డిది ఇదే తీరు. ప్రజలు, ఇంకా కెసియార్‌పై నమ్మకంతోనే ఉన్నారని, అందుకే కెసియార్‌ నిర్ణయాల్ని వ్యతిరేకించడంలేదని జానారెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ నేతలు ఇంకోసారి షాక్‌కి గురయ్యారు. తెలంగాణలో ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్ని కాంగ్రెసు నాయకులంతా విమర్శిస్తోంటే, […]