తాము గెలవలేమని తెలిసినా.. పోటీ ప్రధానంగా టీడీపీ,వైసీపీ మధ్య అని రాజకీయ వర్గాలన్నీ కోడై కూస్తున్నా ఇవేమీ పట్టించుకోకుండా నంద్యాల ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ తమ అభ్యర్థిని నిలబెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే గాక మైనారిటీ వర్గానికి చెందిన అబ్దుల్ ఖాదిర్ను తమ అభ్యర్థిని ప్రకటించింది. ఏ నమ్మకం మీద ఉప ఎన్నిక బరిలోకి దిగింది? మైనారిటీ అభ్యర్థినే బరిలోకి దించడం వెనుక రాజకీయంగా ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే చర్చ ఇప్పుడు మొదలైంది. […]