ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బోణీ కొట్టింది. ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఏకగ్రీవంగా స్థానాలను దక్కించుకుంటోంది. స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగినా.. వారి నామినేషన్లు ఉపసంహరించుకునేలా నాయకులు బుజ్జగిస్తున్నారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీడీపీకి చెందిన బీఎన్ రాజసింహులు.. అలియాస్ దొరబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా తూర్పుగోదావరిలోనూ అటూ ఇటూగా కొంత ఇదే పరిస్థితి ఉన్నా.. స్వతంత్ర అభ్యర్థిని బరిలో నుంచి తప్పించేందుకు నేతలు విశ్వప్రయత్నాలు చేస్తుండటం విశేషం! చిత్తూరు జిల్లా […]