ఏపీలో టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి. ఈ జిల్లాలో అన్ని సీట్లు టీడీపీ ఖాతాలోనే ఉన్నాయి. మంత్రి మాణిక్యాలరావు ఒక్కరే బీజేపీ నుంచి ఉన్నారు. టీడీపీ అంత కంచుకోటలా ఉన్న ఈ జిల్లాలో ఎమ్మెల్యేలందరూ గత కొద్ది రోజులుగా చంద్రబాబుతో పాటు టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. పశ్చిమగోదావరి ఎస్పీ భాస్కర భూషణ్ పనితీరుపై ఎమ్మెల్యేలు కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు పార్టీకి, ప్రభుత్వానికి […]