పీత‌ల ఈ గ్రూపు రాజ‌కీయాల‌తో లాభం ఏంటి…?

టీడీపీ కంచుకోట అయిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో అధికార పార్టీలో గ‌త మూడేళ్లుగా ఎంపీ వ‌ర్సెస్ మాజీ మంత్రి మ‌ధ్య జ‌రుగుతోన్న ఆధిప‌త్య పోరుతో పార్టీకి తీర‌ని న‌ష్టం జ‌రుగుతోంది. ఈ పోరులో త‌ప్పొప్పుల విష‌యంలో ఎవ‌రి వాద‌న‌లు వారు త‌మ‌కు అనుకూలంగా వినిపించుకోవ‌డం కామ‌న్‌. వాస్త‌వంగా చూస్తే ఎక్క‌డో డెల్టాకు చెందిన పీత‌ల సుజాత‌ను గ‌త ఎన్నిక‌ల్లో చింత‌ల‌పూడికి ఆహ్వానించారు. చింత‌ల‌పూడిలో ఆమెను టీడీపీ కార్య‌క‌ర్త‌లు క‌ష్ట‌ప‌డి గెలిపించుకున్నారు. ఎస్సీ లేడీ కోటాలో ఆమెకు గెలిచిన వెంట‌నే […]